ప్రిన్స్ మహేష్బాబు అంటే ఇప్పుడు దేశం మొత్తం తెలిసిన బ్రాండ్ అంబాసిడర్. అందుకేనేమో కోలీవుడ్ దర్శకులు మహేష్ వెంట పడుతున్నారు. మణిరత్నం, శంకర్ ఇద్దరూ మహేష్తో ప్రాజెక్టులు చేద్దామనుకుని భంగపడ్డ విషయం విదితమే. ఆ తర్వాత లింగుస్వామి, గౌతమ్ మీనన్లాంటి క్రియేటివ్ దర్శకులు కూడా అప్పట్లో మహేష్ కోసం తెగ ట్రై చేశారు. ఇప్పుడు తాజాగా ‘రంగం’ లాంటి సంచలనాత్మక చిత్రాన్ని తీసిన దర్శకుడు కె.వి.ఆనంద్ కూడా ఈ తాజా లిస్ట్లో ఉన్నాడు . అయినా ప్రిన్స్ మహేష్బాబుకు ప్రస్తుతం టాలీవుడ్లో బిజీ ప్రాజెక్టులలో మునిగిపోయి ఉన్నాడు. కొత్తగా కోలీవుడ్ దర్శకులకు డేట్స్ ఇవ్వాలంటే వాళ్లు మహేష్ కోసం మరో రెండు సంవత్సరాలు ఆగాల్సిందే. ఇప్పటికే ‘సీతమ్మ వాకిట్లో’ చిత్రం సంక్రాంతి రేస్లో విడుదలకు సిద్ధం కాగా…సుకుమార్తో చిత్రం మూడొంతులు పూర్తయింది. ఈ సమ్మర్లో క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రానికి కమిట్ అయిన మహేష్ ఆ తర్వాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో, దిల్ రాజు బ్యానర్లో మరో చిత్రానికి చేయాల్సి ఉంది.
No comments:
Post a Comment