Tuesday, January 22, 2013

కోర్టులో లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీని సోమవారం ఉదయం  పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. 2005లో పటాన్‌చెరు మండలం ముత్తంగి దగ్గర కలెక్టర్‌ను దూషించిన కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషీయల్ రిమాండ్‌ను కోర్టు విధించింది. బెయిల్ కోసం దాఖలు చేసుకున్న అసదుద్దీన్‌ను పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. అసదుద్దీన్‌ను కోర్టుకు తరలించడంతో హైదరాబాద్‌లోని పాతబస్తీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంఐఎం ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులను భారీగా మోహరించారు.

No comments:

Post a Comment